ఈ ప్రభుత్వం ఆడపడుచుల విశ్వాసాన్ని కోల్పోయింది

భవిష్కత్తులో ఇటువంటి ప్రభుత్వానికి మనుగడ లేదు?

Y. S. Chowdary
Y. S. Chowdary

అమరావతి: ఆరు నెలల్లో వైఎస్సాఆర్‌సిపి ప్రభుత్వం ఆడపడుచుల విశ్వాసం కోల్పోయిందని బిజెపి ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇటువంటి ప్రభుత్వానికి భవిష్యత్తులో మనుగడ లేదని అన్నారు. రాజధాని ప్రాంతంలో అవసరం లేకున్నా 144 సెక్షన్‌ పెడుతున్నారని దుయ్యబట్టారు. అమరావతి కోసం నిరసన తెలుపుతున్న మహిళలపై దాడి చేసి అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఒంగోలులో మహిళలపై మగ పోలీసులు దాడి చేయడం కలచి వేసిందన్నారు. ఇటువంటివి ఆపలేకపోతే మనం పదవుల్లో ఉండటం ఎందకని సుజనా చౌదరి ప్రశ్నించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని రాష్ట్రా ప్రజలకు పిలుపునిచ్చారు. కులాల మధ్య చిచ్చు పెట్టి పైశాచిక ఆనందాన్ని వైఎస్సాఆర్‌సిపి నేతలు పొందుతున్నారని, ఇది సరి చేయలేకపోతే నా పదవులు నాకు అనసరం అన్నారు. పార్టీ సహకారం లేకున్నా వ్యక్తిగతంగా అయిన పోరాడుతా సుజనా చౌదరి ప్రకటించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/