టిడిపి నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారు

చంద్రబాబు నాయుడు పూటకో మాటా మాట్లాడుతున్నారు

malladi vishnu
malladi vishnu

విజయవాడ: చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో చేసిన అక్రమాలు బయటపడుతుంటే టిడిపి నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆయన మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ…అమరావతిని భ్రమరావతి చేసిన చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ చేయమని టిడిపి సవాళ్లు విసిరింది. టిడిపి అక్రమాలు నిగ్గుతేల్చేందుకు సిట్‌ వేస్తే కక్ష అంటున్నారు. టిడిపి నేతలవి నరం లేని నాలుకలు అని ధ్వజమెత్తారు. టిడిపి హయంలోని జరిగిన స్కాంల గురించి రాష్ట్రపతికి ఇచ్చిన పుస్తకంలో ఎప్పుడో పొందుపరిచామని పేర్కొన్నారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే ఇష్టానుసారం దోచేశారని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/