పేదలు సాగు చేసుకుంటున్న భూములు లాక్కుంటున్నారు

ఇంటి స్థలాల పేరుతో బడుగు, బలహీనవర్గాలను రోడ్డున పడేశారు

devineni uma
devineni uma

మంగళగిరి: టిడిపి హయంలో కట్టిన ఇళ్లను పేదలకు పంపిణీ చేయడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. మంగళగిరిలోని టిడిపి ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో సంక్రాంతికి ఇసుక లేకుండా చేసి పేదలను ఇబ్బందులు పెట్టారని, ఇప్పుడు ఉగాదికి భూములను లాక్కొని పేద రైతులను ఇబ్బంది పెడుతున్నారని దేవినేని మండిపడ్డారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటున్నారని, ఇంటి స్థలాల పేరుతో బడుగువర్గాలను రోడ్డున పడేశారని దుయ్యబట్టారు. పోలవరంలో పునాదులు పూర్తి కాలేదని ఎన్నికల ముందు చెప్పిన జగన్‌మోహన్‌ రెడ్డి ..రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో నాటాకాలాడి పోలవరం పనులు నిలిపివేశారని మండిపడ్డారు. పోలవరంపై గత ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని ఎందుకు బయటపెడ్డలేదని దేవినేని ధ్వజమెత్తారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/