విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌లోనే నం.1 నగరం

‘ఉద్యోగాల కోసం మన పిల్లలు ఇతర నగరాలకు వెళ్లే అవసరం ఉండకూడదు

cm jagan
cm jagan

విజయవాడ: ఏపి సిఎం జగన్‌ ఈరోజు విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఉద్యోగాల కోసం మన పిల్లలు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుకు వెళ్లే అవసరం ఉండకూడదు. గతంలో ఉన్న సిఎం, ఆయన అనుచరులు అమరావతి రాజధాని ప్రకటన ముందే భూములు కొనుగోలు చేశారు’ అని వ్యాఖ్యానించారు. ‘గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌లోనే నం.1 నగరం. అమరావతి రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.1.09,000 కోట్లు అవసరమని గత ప్రభుత్వ నివేదికలే చెప్పాయి. ఒకవైపు అమరావతికి రూ.1.09,000 కోట్లు ఖర్చు చేయాలా? లేదా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలా? అని ఆలోచించాను’ అని జగన్ చెప్పారు. ‘ఉద్యోగాల కోసం మన పిల్లలు వేరే ప్రాంతానికి వెళ్లే పరిస్థితి ఉండకుండా చేయాలి. అమరావతిపై రాజకీయాలు చేస్తున్నారు. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. విశాఖ నగరం మన ఊరు, మన నగరం, మన రాజధాని. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ ఉంటుంది. అక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం, హెడ్‌వోడీ, సచివాలయం’ ఉంటాయి అని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/