పచ్చ మీడియా కిందా మీదా పడుతోంది!
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి పచ్చమీడియా కిందా మీదా పడుతోందని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. ఇన్ కంటాక్స్ కమిషనర్ సురిభి అహ్లువాలియాను కూడా దూషించే స్థాయికి వెళ్లి పోయిందని విమర్శించారు. 2,000 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తిస్తే ..కాదు రెండు లక్షల నగదు మాత్రమే దొరికిందని అబద్ధపు ప్రచారం మొదలు పెట్టిందని దుయ్యబట్టారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/