రాజధాని తరలింపు అంశాన్ని విరమించుకోవాలి
మూడు రాజధానుల ప్రకటనతో అనేక వ్యాపారాలు హైదరాబాద్కు తరలిపోయాయి
అమరావతి: రాజధాని తరలింపు అంశం అన్ని రంగాల అభివృద్ధిపై పడిందని, రాజధాని తరలింపు అంశాన్ని విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ సీసీఏం కార్యదర్శి డిమాండ్ చేశారు. మూడు రాజధానుల ప్రకటనతో అనేక వ్యాపారాలు హైదరాబాద్కు తరలిపోయాయని అన్నారు. రాజధాని ప్రాంతంలోని కృష్ణాయపాలెంలో రైతుల దీక్షకు మధు మద్దతు తెలిపారు. ఉద్యమం చేస్తున్న రైతులపై చేయని నేరాలకు కేసులు నమోదు చేయడం తగదని ప్రభుత్వానికి హితవు పలికారు. సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ..ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న రైతులపై ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సమస్యలు సృష్టించి ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారని విమర్శించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/