అందుకే ప్రజలు చంద్రబాబును అడ్డుకున్నారు
అమరావతి రైతులను మోసం చేసింది చంద్రబాబే
అమరావతి: విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని..అందుకే ప్రజల ఆయనను అడ్డుకున్నారని వైఎస్ఆర్సిపి నేత, తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..ఉత్తరాంధ్ర, రాయలసీమకు చంద్రబాబు నాయుడు అన్యాయం చేశారని విమర్శించారు. చంద్రబాబు స్క్రిప్టునే కాంగ్రెస్ నేతలు చదువుతున్నారని ఆమె దుయ్యబట్టారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ఎంపీ నందిగం సురేష్పై దాడి చేశారని మండిపడ్డారు. అమరావతి రైతులను మోసం చేసింది చంద్రబాబే అని అన్నారు. చంద్రబాబు అవినీతి పరుడు, స్వార్థపరుడని..సొంత మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి చెప్పులు వేయించారని లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. ఇవాళ అందుకే చంద్రబాబుపై ఉత్తరాంధ్ర ప్రజలు చెప్పులు వేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇంకా అమరావతి రైతులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి న్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/