ఎమ్మెల్సీలు పోలీసులకు మధ్య వాగ్వాదం

సచివాలయం సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద ఘటన

tension
tension

అమరావతి: శాసనమండలి సమావేశాలకు వస్తున్న టిడిపి ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సచివాలయం సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. శాసనమండలికి వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్సీల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. వాహనాలపై ఎమ్మెల్సీ స్టిక్కర్లు లేకుండా ఎలా అడ్డుకుంటారని పోలీసులు ప్రశ్నించారు. ఎమ్మెల్సీలే వాహనాల్లో ఉంటే స్టిక్కర్లు ఎందుకని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ వాదోపవాదాలు జరిగియి. కాసేపటి తర్వాత ఎమ్మెల్సీల వాహనాలను పోలీసులు అనుమతించారు. ప్రస్తుతం శాసనసభ, మండలి సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/