వైఎస్ఆర్సిపిపై యనమల విమర్శలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టిడిపి నేత యనమల రామకృష్ణుడు సంచలన విమర్శలు చేశారు. రాష్ట్రంలో రోజురోజుకీ వైఎస్ఆర్సిపి దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆరోపించారు. త్వరలోనే ఆ పార్టీకి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశలపై ఏపి సిఎం జగన్ నీళ్లు చల్లారని ఆయన మరోసారి ఆరోపించారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను దారుణంగా వంచించారని యనమల విమర్శించారు. బీసీ మహిళలను కూడా రాజకీయాధికారం నుంచి దూరం చేశారని ఆయన మండిపడ్డారు. బీసీలకు అన్యాయం చేసేందుకే రిజర్వేషన్లపై వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లలేదని చెప్పారు.
తాజా ఇంగ్లీష్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/english-news/