అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
జూన్ 30 వరకు కోర్టు పనుల నిలిపివేత
అమరావతి: టిడిపి నేత అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్పై విచారణను ఏసీబీ కోర్టు జూలై 1కి వాయిదా వేసింది. ఈఎస్ఐ అవకతవకల ఆరోపణలపై అరెస్ట్ అయిన అచ్చెన్న అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. అచ్చెన్నాయుడి మూడు రోజుల ఏసీబీ కస్టడీ ముగియడంతో ఈరోజు బెయిల్ పిటిషన్పై విచారణ జరగాల్సి ఉంది. అయితే జూన్ 30 వరకు న్యాయస్థానాల కార్యకలాపాలను నిలిపివేయడంతో విచారణను జూలై ఒకటికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/