భక్తులు ఇచ్చిన భూములను అమ్మడం సరికాదు

టీటీడీ భూములను కాపాడాలి..మంత్రి గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasa Rao
Ganta Srinivasa Rao

అమరావతి: టిడిపి నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ 42వ వార్డులో పేదలకు నిత్యావసర వస్తువులను గంటా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల వెంకన్నకు భక్తులు ఇచ్చిన భూములను కాపాడాలని అన్నారు. దేవుడి కోసం భక్తులు ఇచ్చిన భూములను అమ్మడం సరికాదని చెప్పారు. ఏ ప్రభుత్వమైనా దేవుడి భూములను అమ్మడం కరెక్ట్ కాదని తెలిపారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న విషయంపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని చెప్పారు. మంత్రి అవంతి చేస్తున్న వ్యాఖ్యలపై కూడా సమయం వచ్చనప్పుడు మాట్లాడతానని అన్నారు. కాగా ఎల్జీ పాలిమర్స్ బాధితులను మహానాడు తర్వాత తమ అధినేత చంద్రబాబు పరామర్శిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, స్థానికి టిడిపి నేతలు పాల్గొన్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/