హనుమంత వాహనంపై శ్రీనివాసుడు

Srivari-Brahmotsavam

తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజు ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. ఆల‌యంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో మలయప్పస్వామి వారు వేంక‌టాద్రిరాముని అలంకారంలో దర్శనమిచ్చారు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.
కాగా, సాయంత్రం 4 నుంచి 5 గంట‌ల వ‌ర‌కు స్వర్ణ ర‌థం బదులుగా స‌ర్వభూపాల వాహ‌నసేవ జ‌రుగుతుంది. రాత్రి 7 గంటలకు గ‌జ‌వాహనంపై స్వామివారు కటాక్షిస్తారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/