పవన్ కల్యాణ్ ను కలిసిన సోము వీర్రాజు
శాలువాతో సత్కరించిన పవన్
అమరావతి: ఏపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కలిశారు. తాను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత పవన్ ను సోము వీర్రాజు కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా వీర్రాజుకు శాలువా కప్పి పవన్ అభినందించారు. అనంతరం ఇరువురు కలిసి పలు విషయాలపై చర్చించారు. రానున్న రోజుల్లో ఇరు పార్టీలు ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. ఏపిలో జనసేన, బిజెపిలు మిత్రపక్షాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/