మహిళలంతా జగన్ కు జై కొడుతున్నారు : రోజా

mla roja
mla roja

అమరావతి: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం వేడుకలు నిర్వహిచింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు . ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ.. మహిళలు అడక్కుండానే సీఎం ఎంతో చేస్తున్నారని, మహిళలంతా జగన్ కు జై కొడుతున్నారని ఆమె కొనియాడారు . మహిళా సాధికారతకు జగన్ అవకాశం కల్పించారని అన్నారు . ఎందరో నాయకులు వచ్చిపోయారని .. వారెవరూ సాధించలేని దాన్ని సీఎం జగన్ చేసి చూపించారని రోజా అన్నారు . కాగా, మహిళాల పై దాడి చేసినా చరిత్ర టీడీపీ నేతలదేనని రోజా విమర్శర్చించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/