ఘోర రోడ్డు ప్రమాదం .. ఐదుగురి మృతి
మరో 20 మందికి తీవ్ర గాయాలు
కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని సంగయ్య పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. మరో 20 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారందరినీ పోలీసులు, సహాయక సిబ్బంది కలిసి మెదక్ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను సంగారెడ్డి మండలం ఫసల్వాది వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరు సొంత గ్రామం నుంచి ఏడుపాయలకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/