మీరంతా రిజైన్‌ చేసి మళ్లీ గెలవండి

ఇంకా 1990ల్లోనే ఉంటే ఎలా చంద్రబాబు!

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై వెస్సార్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి..రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే కౌన్సిల్‌ రద్దును సమర్థిస్తామని రంకెలు వేసే బదులు చంద్రబాబునాయుడు మరియు టిడిపి పార్టీ ఎమ్మెల్యేలు రిజైన్‌ చేసి మళ్లీ పోటిచేసి గెలవండి అపుడు రిఫరెండంగా భావిస్తామని విజయసాయిరెడ్డి సవాల్‌ విసిరారు. నోరు తెరిస్తే దమ్ము, సత్తాల గురించి మాట్లాడటం తప్ప వాటిని ప్రదర్శించే సాహసం మాత్రం చంద్రబాబు నాయుడు చేయడని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇంకా 1990ల్లోనే ఉటే ఎలా చంద్రబాబు! అని ఆయన ట్వీట్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/