డిగ్రీ విద్యార్థినిపై రైల్వే గార్డు లైంగికదాడి
విజయవాడ: విజయవాడలోని ఒక కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థినిపై రైల్వేగార్డు అనీల్కుమార్ (40) లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనీల్కుమార్ తాడేపల్లిలో నివాసం ఉండేవాడు. అతని ఇంటి ఎదురుగా ఉండే విద్యార్థినిని ఆకర్షించేందుకు ప్రయత్నించాడు. నీ ఫొటోలు నా ఫోన్లో ఉన్నాయి అని తెలపడంతో కంగుతిన్న ఆమె వాటిని చూసేందుకు అనీల్కుమార్ ఇంటికి వెళ్లింది. ఈ సమయంలో లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అప్పుడు చరవాణిలో ఫొటోలు తీసి బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడేవాడని వెల్లడించారు. ఈ నెల ఒకటో తేదీన కళాశాలకు వెళ్లిన అనీల్కుమార్.. ఫొటోలు చూపి బెదిరించి హోటల్కు తీసుకువెళ్లాడని చెప్పారు. అనీల్కుమార్ భార్య దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విద్యార్థినిపై లైంగికదాడి ఘటన వెలుగుచూసింది. సత్యనారాయణపురం పోలీసులు హోటల్కు వెళ్లి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అనీల్కుమార్ తనపై లైంగికదాడికి పాల్పడుతున్నట్లు పోలీసులకు విద్యార్థిని వివరించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/