టిడిపికి మరో నేత రాజీనామా

కపడ జిల్లా పులివెందులకు చెందిన టిడిపి నేత సతీశ్‌రెడ్డి రాజీనామా

Pulivendula-leader-Satish-Reddy
Pulivendula-leader-Satish-Reddy

పులివెందుల: ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టిడిపికి షాక్‌ తుగులుతుంది. ఒక్కొక్కరుగా కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు కడప జిల్లా పులివెందులకు చెందిన టిడిపి నేత సతీశ్‌రెడ్డి ఆపార్టీకి రాజీనామా చేశారు. తన అనుచరులు, సన్నిహితులు, అభిమానులతో మంగళవారం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లిలో ఉన్న తన నివాసంలో సమావేశమైన సతీష్‌రెడ్డి భవిష్యత్ కార్యాచరణపై అందరితో చర్చించారు.. అందరితో చర్చించిన తర్వాత పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను టిడిపిలో కొనసాగలేనన్నారు. చంద్రబాబుతో తనకు గ్యాప్ పెరిగిందని.. ఎంత కష్టపడ్డా తనపై చంద్రబాబుకు నమ్మకం లేదన్నారు. వైఎస్ కుటుంబంతో దశాబ్దాలుగా పులివెందులలో పోరాడినా టిడిపి ఆదరించలేదని వ్యాఖ్యానించారు. 25 ఏళ్లగా టిడిపితో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నాను అంటూ అనుచరులతో సమావేశంలో క్లారిటీ ఇచ్చేశారు. భవిష్యత్‌లో ఏ పార్టీలో చేరేది తర్వాత ప్రకటిస్తానన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/