ఏప్రిల్ 14వరకు చర్చిల్లో ప్రార్థనలు నిషేధం
కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణయం
Srikakulam: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా జిల్లాలోని అన్ని చర్చిలలోనూ ఏప్రిల్ 14వరకు సామూహిక ప్రార్ధనలను నిషేధిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి యం.అన్నపూర్ణమ్మ తెలిపారు.
ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఆర్ధిక సంస్థ మేనేజింగ్ డైరక్టర్ , జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/