పత్రికా రంగానికి పొత్తూరి సేవలు చిరస్మరణీయం

వర్ధమాన పాత్రికేయులకు పొత్తూరి శైలి మార్గదర్శకం

pawan kalyan
pawan kalyan

అమరావతి: తెలుగు పాత్రికేయ రంగంలో శిఖర సమానులైన పొత్తూరి వెంకటేశ్వరరావు మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటు అని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. పొత్తూరి మృతి పట్ల పవన్‌ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఐదు దశాబ్దాలకు పైగా తెలుగు పత్రికా రంగానికి పొత్తూరి అందించిన సేవలు చిరస్మణీయమని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రధేశ్‌లో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా విశిష్ట సేవలందించారని గుర్తుచేశారు. వర్ధమాన పాత్రికేయులకు పొత్తూరి శైలి మార్గదర్శకం అని తెలిపారు. పొత్తూరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/