నారా లోకేశ్ను అరెస్టు చేసిన పోలీసులు
బెంజి సర్కిల్ వద్ద అదుపులోకి.. ఆయనతోపాటు మరో ముగ్గురు నేతలు కూడా
విజయవాడ: టిడిపి ఎమ్మెల్సీ నారా లేకేశ్ ను పోలీసులు బెంజిసర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ ఎమ్మెల్యె గద్దె రామ్మోహన్ రావు విజయవాడలో 24 గంటల రిలే నిరాహారదీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దీక్షాస్థలికి లోకేశ్ వెళ్లారు. దీక్షకు సంఘీభావం ప్రకటించిన అనంతరం ఆయన అక్కడి నుంచి బయల్దేరారు. తిరిగి వస్తున్న సమయంలో కనకదుర్గమ్మ వారధి వద్ద లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్ తో పాటు అదే వాహనంలో ప్రయాణిస్తున్న టిడిపి ఎమ్మెల్యె రామానాయుడును, మరో ఇద్దరు నేతలను కూడా అరెస్ట్ చేశారు. అయితే వీరిని కలెక్టరేట్ మీదుగా తొట్లవల్లూరు వైపు తీసుకెళ్లారు. మరోవైపు నారా లోకేశ్ అరెస్టుపై టిడిపి శ్రేణులు మాట్లాడుతూ.. పార్టీ ఆఫీసుకు వెళ్తున్నానని లోకేశ్ చెబుతున్నప్పటికీ పోలీసులు వినకుండా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
తాజా క్రీడా వార్త లకోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/