కరోనాను తరిమికొట్టాలి
ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రచారం
West Godavari District: కరోనాపై ప్రజలంతా యుద్ధం చేసి తరిమికొట్టాలని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు.
కరోనాపై ప్రజలకు అవగాహనకల్పించడానికి నియోజకవర్గ పర్యటన నిర్వహించారు. ఈ మేరకు కొయ్యలగూడెం పట్టణంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ కరోనాపై విస్తృత ప్రచారం చేపట్టారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకై దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిందని అన్నారు.
ప్రజలంతా ఇంటికే పరిమితమవడం వల్ల కరోనా వ్యాప్తిని అరికట్టి, వైరస్ బారినుండి తప్పించుకోవచ్చని తెలిపారు
తాజా వార్త ఇ-పేపర్ కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com