కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
కోవిడ్ -19 నెగిటివ్ వచ్చిన వారికి ప్రోటోకాల్ పాటించాలని సూచన
అమరావతి: రాష్ట్రంలొని కలెక్టర్లు, ఎస్పీ లతో సిఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నివారణ చర్యలకు సంబందించి కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. నిత్యవసరాలు అందుబాటులో ఉంచటం వల్ల జనాలు గుమికూకుండా చూడోచ్చన్నారు. హట్స్పాట్లలో హోం డెలివరి చేస్తే మంచిదని సూచించారు. క్వారంటైన్లో ఉన్న వారికి సదుపాయలు కల్పించాలని, నెగిటివ్ వారిని ఇళ్లకు పంపేటపుడు ప్రోటోకాల్ పాటించాలని సూచించాడు. ఒకటికి రెండుసార్లు పరీక్షలు జరపాలని చెప్పారు. కుటుంబ సర్వే ద్వారా కరోనా లక్షణాలు ఉన్నవారికి టెస్ట్లు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/