మూడు రాజధానుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

హైకోర్టు రేపు విచారణ

High Court of Andhra pradesh
High Court of Andhra pradesh

Amaravati: మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు నిర్ణయాలను సవాల్ చేస్తూ రాజధాని పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది.

మూడు రాజధానుల గెజిట్ నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

గెజిట్ అమలు నిలిపివేయాలని, సీఎం కార్యాలయం, రాజ్ భవన్, సెక్రటేరియట్ ను ఇక్కడి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి కోర్టును కోరింది.

కాగా, ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.

తాజా ‘ఆధ్యాత్మికం’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/