ఏపిలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ

ఈ నెల నుంచి కొత్తగా 2,20,385 మందికి పెన్షన్లు

Pension Distribution Began In Andhra Pradesh

అమరావతి: ఏపిలో శనివారం తెల్లవారుజాము నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 58.23 శాతం పెన్షన్ల పంపిణీ జరిగింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. మొత్తం 61.28 లక్షల లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.1478.90 కోట్లు విడుదల చేసింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పింఛన్లు పంచుతున్నారు. ఈ నెల నుంచి కొత్తగా 2,20,385 మందికి పెన్షన్లు మంజూరయ్యాయి. రాష్ట్రంలో 2.68 లక్షల మంది వాలంటీర్లు నేరుగా లబ్ధిదారుల చేతికే పెన్షన్‌ అందిస్తున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా అందిస్తున్న పెన్షన్లను కూడా ప్రభుత్వం పెంచింది. వారికి వైఎస్సార్‌ కానుక కింద వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ జరుగుతుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా బయోమెట్రిక్‌కు బదులు జియో ట్యాగింగ్‌తో కూడిన ఫోటోలను తీసుకుని పెన్షన్ పంపిణీ చేస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/