సందేహాలకు తావిస్తున్న అచ్చెన్నాయుడు అరెస్టు
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ వ్యాఖ్య
Amaravati: అసెంబ్లీ సమావేశాలకు ముందు టీడీపీ శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు అరెస్టు సందేహాలకు తావిస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
అలాగే ఒక ఎమ్మెల్యే ను అరెస్టు చేసే ముందు రాజ్యాంగ నిబంధనలను పాటించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
అచ్చెన్నాయుడు అరెస్టులో ప్రభుత్వం నిబంధనలను పాటించనట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
అచ్చెన్నాయుడు అరెస్టు అవినీతికి పాల్పడినందుకా? లేదా రాజకీయ కక్ష సాధింపు కోసమా? అనే విషయంలో వైసీపీ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పవన్ కోరారు.
అవినీతి ఏ రూపంలో ఉన్నా, దానికి బాధ్యులు ఎంతటి వారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.
ఈఎస్ఐలో జరిగిన అవకతవకలతోపాటు అన్ని అక్రమాలపై దర్యా ప్తు జరిపించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/