మోడి అద్భుతమైన నాయకత్వంలో 21వ శతాబ్దం భారత్ దే

ప్రధాని మోడికి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

Pawan kalyan
Pawan kalyan

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రధాని మోడికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా మోడి రెండో సారి బాధ్యతలను చేపట్టి ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యలో మోడికి పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈసందర్భంగా పవన్‌ కల్యాణణ్‌ ప్రధానికి గ్రీటింగ్స్ చెపుతూ ట్వీట్ చేశారు. ‘ఏడాది పాలనలో సాహసోపేతంగా ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చిన ప్రభుత్వంలో ఉన్నవారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ఏడాది మన దేశం చరిత్రాత్మక నిర్ణయాలను చూసింది. త్వరలోనే స్వావలంబన కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుంది. మోడి అద్భుతమైన నాయకత్వంలో 21వ శతాబ్దం భారత్ దే అవుతుంది’ అని ట్వీట్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/