వరద బాధితులకు పవన్‌ రూ.కోటి విరాళం

pawan kalyan

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ప్రభుత్వానికి రూ. 1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా పవన్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పునరావాస చర్యలను పవన్ ప్రశంసించారు. గత కొన్నేళ్లుగా టౌన్ ప్లానింగ్ విభాగం ఫెయిల్ అయిన నేపథ్యంలోనే… ఇప్పుడు ఈ స్థాయిలో విపత్తు సంభవించిందని అన్నారు.

కాగా వరద బాధితుల సహాయార్థం జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దించింది. నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు తరలించింది. ఎవరికీ ఆహారం, మందుల కొరత లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. మరోవైపు వరదబాధితులను ఆదుకోవాలన్నసిఎం కెసిఆర్‌ పిలుపు మేరకు సినీ ప్రముఖులు భారీ ఎత్తున విరాళాలను ప్రకటిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/