బానిస సంకేళ్ల నుంచి బయటపడతలేరు!
విధేయతలో కట్టప్పను మించిపోయారు
అమరావతి: వైఎస్సార్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వెట్టిచాకిరి నిర్మూలన చట్టం 1976 లోనే వచ్చినా ప్యాకేజీ స్టార్ లాంటి వాళ్లు బానిస సంకేళ్లు నుంచి బయటపడలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. జనం నవ్వుకుంటారన్న ఇంగితం లేకుండా యజమానిని సమర్థిస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించే నైతిక హక్కు ఎవరికీ లేదట? బహుబలి సినిమాలో కట్టప్పను మించి పోయాడని పవన్కళ్యాణ్పై పరోక్ష విమర్శలు చేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/