అమరావతి కోసం 25 పైగా గుండెలు ఆగిపోయాయి
ఉద్యమం చేస్తున్నా మహిళలపై పోలీసులు దౌర్జన్యంగా ప్రవరిస్తున్నారు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సిపి ప్రభుత్వ పాలనపై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. తెనాలిలో రాజధాని రైతులకు మద్ధతుగా నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. రాజధాని రైతులు 49 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా…ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. అమరావతి కోసం ఇప్పటి వరకు 25 మందికి పైగా ప్రజల గుండెలు ఆగినా..ప్రభుత్వం స్పందిచండం లేదన్నారు. ఉద్యమం చేస్తున్న మహిళలపైనా పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించడం దారుణమన్నారు. స్టేషన్కు వెళ్తే పేరేంటి..కులమేంటని ప్రశ్నిస్తున్నారని..ఇకపై ఎవరైనా అలా అడిగితే మన కులం ఆంధ్రప్రదేశ్ అని చెబుదామని నారా లోకేష్ పిలుపు నిచ్చారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/