సత్తెనపల్లిలో పోలీసు దెబ్బలకు ఒకరి మృతి

లాక్‌డౌన్‌ సమయం సడలింపులోనే ఘటన

Dead
Dead

సత్తెనపల్లి, (గుంటూరుజిల్లా): ఉదయం 8.40 గంటల సమయంలో నిత్యావసర సరుకులు కోసం వెళ్లి తిరిగి వస్తుండగా, పోలీసు లాఠీ దెబ్బలకు యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం ఉదయం జరిగింది..

వెంకటపతికాలనీకి చెందిన మొహమ్మద్‌ గౌస్‌(28) ఇవాళ ఉదయం సరుకుని తీసుకుని ఇంటికివెళ్తుండగా పోలీసు దెబ్బలకు మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు..

అక్కిడిక్కడే స్పృహ తప్పి పడిపోయిన మొహమ్మద్‌ గౌస్‌ను పోలీసు వాహనంలో వైద్యశాల తరలించగా, మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు..

మృతునికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/