ఏపిలో ఆగస్టు 1 నుంచి కొత్త పెన్షన్లు

కొత్తగా మరో 2,20,385 మంది పెన్షన్లు

Aasara pensioner
pensioner

అమరావతి: ఏపిలో ఆగస్టు 1న పెన్షన్ల పంపిణికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఏపి 61.28 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. పెన్షన్ల కోసం రూ. 1478.90 కోట్లను ఏపి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల నుంచి కొత్తగా మరో 2,20,385 మంది పెన్షన్ ఇవ్వనున్నారు. జూన్‌ నెలలో రెండు విడతల్లో 2.11 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి. మొదటి విడతలో మంజూరైన 1.15 లక్షల మందికి జూలై ఒకటిన పింఛన్‌ డబ్బు పంపిణీ చేస్తున్నామని, మిగతా 96 వేల మందికి ఆగస్టు ఒకటి నుంచి పంపిణీ చేస్తామని సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు. బ్రహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే పెన్షన్ల మొత్తం పెంచారు. వైఎస్‌ఆర్‌ పెన్షన్ కానుక కింద వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందించనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/