నెల్లూరులో రేపటి నుండి లాక్‌డౌన్‌!

రేపటి నుంచి వారం రోజుల పాటు లాక్ డౌన్

lockdown

నెల్లూరు: ఏపిలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 65 మంది ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లాలో కూడా నిన్న 327 కేసులు నమోదయ్యాయి. కరోనాను కట్టడి చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా… ఇప్పటి వరకు 3010 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రేపటి నుంచి నెల్లూరులో లాక్ డౌన్ విధించబోతున్నారు. జూలై 24 నుంచి 31వ తేదీ వరకు వారం రోజుల పాటు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఉంటుంది. మెడికల్ షాపులు, పాల బూత్ లకు మాత్రం సాయంత్రం వరకు అనుమతి ఉంటుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో లాక్ డౌన్ అమలవుతోంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/