బార్బర్లను ప్రభుత్వం ఆదుకోవాలి

నేడు వరల్డ్ బార్బర్స్ డే

nara lokesh
nara lokesh

అమరావతి: నేడు వరల్డ్ బార్బర్స్ డే సందర్భంగా టిడిపి నేత నారా లోకేశ్‌ నాయీ బ్రాహ్మణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నాయీ బ్రాహ్మణ వృత్తి ఓ కళ అని, ఆ కళలో నైపుణ్యం పెంచడం కోసం గత టిడిపి హయాంలో కృషి చేశామని తెలిపారు. సెలూన్ అంటే కేవలం జీవనాధారం కోసం అని కాకుండా, ఒక పరిశ్రమలా ఎదగాలన్న ఆలోచనతో అవసరమైనవన్నీ చేశామని వివరించారు. కానీ ఇప్పుడు బీసీ కార్పొరేషన్ నిర్వీర్యమైపోయిందని, ఆదరణ పథకం రద్దయిపోయిందని విమర్శించారు. ‘రూ.5 లక్షల ప్రమాద బీమా పత్తా లేదు. జగన్ గారు, 5.50 లక్షల మందిలో కేవలం 38 వేల మందికే చేదోడు ఇచ్చి నాయీ బ్రాహ్మణులకే సంక్షేమ ‘కటింగ్’ చేశారు’ అంటూ విమర్శించారు. కరోనా ప్రత్యేక సాయాన్ని ప్రకటించి బార్బర్లను ప్రభుత్వం ఆదుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/