చంటి పిల్లల్ని అరెస్టు చేస్తారా?
ఫోటోలను పోస్టు చేసిన నారా లోకేశ్
అమరావతి: ఏపి రాజధాని కోసం రైతులు, మహిళల విషయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రవర్తన సరికాదంటూ టిడిపి నేత నారా లోకేశ్ విమర్శించారు. నిరసనలో పాల్గొన్న చిన్న పిల్లాడిని అరెస్టు చేసిన ఫోటో ఒకటి ఆయన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అతేకాకుండా ఓ యువతితో భత్రతా బలగాలు అనుచితంగా వ్యవహరించినట్లుగా ఉన్న మరో ఫోటోను కూడా ఆయన పోస్టు చేశారు. ‘చంటి పిల్లల్ని అరెస్ట్ చేసే స్థాయికి దిగజారిపోయారు జగన్. వైఎస్ఆర్సిపి రాక్షస పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు హేయనీయం’ అని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అరెస్ట్ చేసిన మహిళల్ని మీది ఏ కులమో చెబితే కానీ విడుదల చెయ్యం అని నిలదీస్తారా? ఈ ఘటనలతో మహిళలపై జగన్ కి ఉన్న గౌరవం ఏంటో సమాజానికి అర్థం అయ్యింది. అరెస్టులు కాదు దమ్ముంటే మా అక్కా, చెల్లెళ్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి’ అని లోకేశ్ నిలదీశారు.
తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/nri/