సంతకం చేయడం ఇష్టం లేనప్పుడు తిరుమలకు ఎందుకు వెళ్లాలి?

వెంకన్నపై విశ్వాసం ఉన్నప్పుడు డిక్లరేషన్ పై జగన్ సంతకం చేయాలి

nakka anand babu
nakka anand babu

అమరావతి: డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమల వెంకన్న వద్దకు ముఖ్యమంత్రి జగన్ వెళ్తున్నారని , తద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని టిడిపి నేత నక్కా ఆనందబాబు మండిపడ్డారు. వెంకన్నపై నమ్మకం ఉందని సంతకం పెట్టడం ఇష్టం లేనప్పుడు తిరుమలకు వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు నారా లోకేశ్ మంత్రిగానే లేరని… అలాంటప్పుడు రూ. 2 వేల కోట్ల అవినీతిని ఆయన ఎలా చేస్తారని ఆనందబాబు దుయ్యబట్టారు. దళితుల్లో 80 శాతం మంది జగన్ పార్టీకే ఓటు వేశారని… దానికి ప్రతిఫలంగా దళితులపై దాడులు జరుగుతున్నాయని, శిరోముండనాలు చేస్తున్నారని, హత్యలకు తెగబడుతున్నారని అన్నారు. టిడిపి పార్టీపై అవినీతి బురద చల్లేందుకు వైఎస్‌ఆర్‌సిపి ప్రయత్నిస్తోందని… మనీలాండరింగ్, క్విడ్ ప్రోకో, ఇన్సైడర్ ట్రేడింగ్ వంటి పదాలను జనాలకు పరిచయం చేసింది జగన్, విజయసాయిరెడ్డేనని విమర్శించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/