ప్రభుత్వంపై లోకేశ్ విమర్శలు

వైఎస్ జగన్ భూదాహానికి బలైపోతున్నారు

nara lokesh
nara lokesh

అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘వైఎస్ జగన్ భూదాహానికి దళితులు, గిరిజనులు బలైపోతున్నారు. భూమి కోసం గిరిజన యువకుడిని పొట్టన పెట్టుకున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చింతలపాళెం  పంచాయతీ, మరాఠీపురానికి చెందిన 112 షికారీ కుటుంబాలకు 1971 నుంచి మూడు విడతలుగా సుమారు 560 ఎకరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆ భూమిని కొట్టేయడానికి అధికార పార్టీ నాయకులు దాడికి దిగి 23 మందిని గాయపర్చారు’ అని చెప్పారు. ‘గిరిజన యువకుడు డబ్బా బాబ్లీని అత్యంత కిరాతకంగా హత్యచేశారు. గిరిజన మహిళని అప్పు తీర్చలేదంటూ వైకాపా నాయకుడు ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన మరవక ముందే ఇప్పుడు గిరిజన యువకుడు బలైపోయాడు’ అని చెప్పారు.  

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/