రూ.2600 కోట్లు ..మ‌హిళ‌ల‌కు రుణాలైనా తీరేవి

‘మీ ఇంటికొస్తే ఏమిస్తావు? మా ఇంటికొస్తే ఏమి తెస్తావు అనే టైపు సీఎం జగన్‌’

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: టిడిపి నేత లోకేశ్‌ సిఎం జగన్‌పై విమర్శలు కురిపించారు. పంచాయతీ కార్యాలయాలకు ‘రంగులేస్తే రూ.1300 కోట్లు, వాటిని తీస్తే రూ.1300 కోట్లు, వాటేన్ ఐడియా జ‌గ‌న్‌జీ. 2600 కోట్లు పెడితే డ్వాక్రా మ‌హిళ‌ల‌కు మీరు మాటిచ్చి త‌ప్పిన రుణాలైనా తీరేవి’ అని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. అంతేకాక జగన్‌పై లోకేశ్‌ ఓ కార్టూన్‌ను పోస్ట్ చేశారు. ‘మీ ఇంటికొస్తే ఏమిస్తావు? మా ఇంటికొస్తే ఏమి తెస్తావు అనే టైపు సీఎం జగన్‌’ అని ఆయన ఎద్దేవా చేశారు. జగన్‌ గ్రామ పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేస్తుండగా.. అందుకు అయ్యే ఖర్చుతో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయొచ్చు కదా? అంటూ ప్రజలు చర్చించుకుంటున్నట్లు కార్టూన్‌ ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/