వైభవంగా తిరుమల కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
పరిమిత సంఖ్యలోనే సిబ్బంది అనుమతి.. ఈవో ధర్మారెడ్డి
తిరుమల: తిరుమలలో నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగిందని ఈవో ధర్మారెడ్డి అన్నారు. నూతన తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని టిటిడి ఆలయ శుద్ది కార్యక్రమాన్ని చేపట్టింది. తెల్లవారుజామునే అర్చకులు స్వామివారికి సుప్రభాతం , అర్చన సేవల అనంతరం మూలవిరాట్పై పట్టువస్త్రాలతో పూర్తిగా కప్పివేశారు. సుగంధద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ప్రదక్షిణగా తీసుకుకెళ్లి ఆలయ శుద్ది చేశారు. ఆలయ శుద్ది అనంతరం మూలవిరాట్పై కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజా, నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలోనే సిబ్బందిని అనుమతించినట్లు తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/