కియా పరిశ్రమ యాజమాన్యం సంతృప్తికరంగా ఉంది
కియా ప్లాంట్ పై తప్పుడు ప్రచారం చేసినా వారిపై కఠిన చర్యలు
అమరావతి: కియా ప్లాంట్ ఎక్కడకీ వెళ్లడం లేదని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి స్పష్టం చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కియా ప్లాంట్ను తరలిసిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కియా పరిశ్రమ యాజమాన్యం సంతృప్తికరంగా ఉన్నప్పుడు..ఇలాంటి దుప్ప్రచారం చేయడం తగదన్నారు. తమ ప్లాంట్ ఏపీ నుంచి తరలిపోతుందంటూ వస్తున్న వార్తలపై కియా సంస్థ ప్రతినిధులు కూడా ఖండించినట్లు ఆర్థిక మంత్రి గుర్తు చేశారు. రూ. 14 వేల కోట్లతో కియా ప్లాంట్ ప్రారంభించిందన్నారు. గత టిడిపి ప్రభుత్వం మాదిరిగా తాము అనవసర ప్రచారం చేసుకోవడం లేదని బుగ్గన తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/