సీఎం జగన్కు జనసేన నేత నాగబాబు సూచన
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ట్వీట్టర్ ద్వారా సలహా ఇచ్చారు. దయచేసి మీ తప్పులను సరిదిద్దుకొని, మిగిలిన నాలుగున్నరేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించండని ముఖ్యమంత్రి జగన్ను కోరారు. మీకు అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. రాష్ట్రంలో సుపరిపాలన అందించాలని మీరు అనుకుంటే రాష్ట్ర ప్రజలతో గొడవ పెట్టుకోకండి, గందరగోళానికి గురవ్వకండి అని అన్నారు. మీరు చేసే తప్పుల ఆధారంగా రాజకీయ ప్రయోజనాలు పొందాలని మేము అనుకోము. ఇటువంటి ఆలోచనలు జనసేన పార్టీకి లేవని నాగబాబు తెలిపారు. మీ ఎమ్మెల్యేలను నియంత్రణలో పెట్టకోండి అని సీఎం జగన్కు ఆయన సూచించారు మీ నిర్ణయాలను విమర్శించే అవకాశాన్ని మాకు ఇవ్వకండి అని నాగాబాబు ట్వీట్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/