కరోనాపై జగన్ బ్రహ్మాస్త్రం
ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు
అమరావతి: రాష్ట్రంలో ఒక్కొక్కరికి మూడు మాస్కులు అందించాలని, సిఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఓ బ్రహ్మాస్త్రం లాంటిదని, వైయస్ఆర్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కోన్నాడు. ఈ నిర్ణయంతో దేశం మొత్తం హర్షం వ్యక్తం చేస్తుందని అన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మూడు మాస్కులు అందజేయాలని సిఎం జగన్ గారు చూపిన మార్గానికి దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. 16 కోట్ల మాస్కుల పంపిణి ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. కరోనాపై బ్రహ్మాస్త్రం ఇది. అతి తక్కువ ప్రాణ నష్టంతో ఏపి సేఫెస్ట్ ప్లేస్ అవుతుంది. అని ట్విట్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/