టిడిపి సీనియర్‌ నేత నివాసంలో ఐటీ దాడులు

వ్యాపారానికి సంబంధించిన పలు రికార్డుల పరిశీలన

tdp
tdp

కడప: టిడిపి సీనియర్‌ నాయకుడు, కపడ జిల్లాకు చెందిన శ్రీనివాసులురెడ్డి ఇంటిపై ఈరోజు జామున ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేశారు. మొత్తం 10 మంది అధికారులతో కూడిన బృందం శ్రీనివాసులురెడ్డి ఇంటికి చేరుకుంది. ఆయన ఆదాయ పన్ను చెల్లింపు వివరాలపై ఆరాతీసింది. ఆయన వ్యాపారాలకు సంబంధించిన పలు దస్త్రాలు, రికార్డులను ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాసులురెడ్డిపై ఐటీ శాఖ దాడుల సమాచారం స్థానికంగా సంచలనమైంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/