సేవా టిక్కెట్ల కోటాను తగ్గించడం సముచితంకాదు
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులను చిత్తూరు జిల్లాలోని ఆలయాల పున:రుద్ధరణకు వెచ్చించాలి
తిరుమల: లక్కిడిప్లో కేటాయించే సేవా టిక్కెట్ల కోటాను తగ్గించడం సముచితం కాదని బిజెపి రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు హరతి తీసివేయడం సముచితం కాదని అన్నారు. పదివేలు రూపాయలు విరాళంగా ఇస్తున్న భక్తులకు గతంలో మాదిరిగానే దర్శనభాగ్యం కల్పించాలన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులతో ముందుగా చిత్తూరు జిల్లాలోని ఆలయాల పున:రుద్దరణకు వెచ్చించలన్నారు. ప్రభుత్వం పాస్టర్లకు ఇస్తున్న తరహాలోనే శ్రీవాణి ట్రస్ట్ నిధులను ఆలయాల ధూపదీప నైవేద్యానికి వెచ్చించలన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/