తెలంగాణ లో కొనసాగుతున్న ఐపీఎస్ల బదిలీలు
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున ఐపీఎస్లను బదిలీ చేస్తుంది. ఇప్పటికే అనేక మందిని బదిలీ చేసి ఆ స్థానంలో మరొకర్ని నియమించగా..తాజాగా 9 మంది ఐపీఎస్ల బదిలీ చేసింది.
హైదరాబాద్లో సిట్, క్రైమ్స్ జాయింట్ సీపీగా ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ జాయింట్ సీపీగా విశ్వప్రసాద్, వెస్ట్ జోన్ డీసీపీగా విజయ్కుమార్, స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా జోయల్ డేవిస్, నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని, సీసీఎస్ డీసీపీగా ఎన్.శ్వేత, హైదరాబాద్ ట్రాఫిక్-1 డీసీపీగా ఎస్ సుబ్బారాయుడిని బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. టాస్క్ ఫోర్స్ డీసీపీగా పని చేస్తున్న నికిత పంత్, సిట్ క్రైమ్స్ జాయింట్ సీపీగా పని చేస్తున్న గజరావ్ భూపాల్, నార్త్ జోన్ డీసీపీగా పని చేస్తున్న చందనా దీప్తీలను డీజీపీ ఆఫీస్ లో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.