హైదరాబాద్ లో నారాయణ కాలేజీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

మేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డికి చెందిన రాగుల వంశిత (16) అనే విద్యార్థినిని వారం క్రితం నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపిసిలో జాయిన్ చేశారు తల్లిదండ్రులు. ఈరోజు ఉదయం విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో కింద పడి మృతి చెందింది. దీంతో హుటాహుటిన కళాశాల యాజమాన్యం బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు.

సీఐ సుమన్‌ కుమార్‌ తెలిపిన ప్రకారం.. కామారెడ్డి పట్టణనికి చెందిన ఆర్‌.వంశిక (16)ను వారం క్రితమే తల్లిదండ్రులు హస్టల్‌లో చేర్పించి వెళ్లారు. మంగళవారం ఉదయం ఆమె భవనంపై నుంచి కింద పడి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించిన సహ విద్యార్థులు కళాశాల నిర్వాహకులకు సమాచారం అందిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. అయితే, వంశిక ప్రమాదవశాత్తూ జారి పడిందా? లేక ఆత్మహత్య చేసుకుందా?.. మరేదైనా కారణమా? అనేది ఇంకా తెలియరాలేదు. వారం రోజుల క్రితమే క్యాంపస్ లో చేరిన విద్యార్థిని ఇంతలోనే విగతజీవిగా మారడంపై స్థానికులు, పేరెంట్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.