తూళ్లూరులో జాతీయ మహిళా కమిషన్‌ విచారణ

National Commission for Women committee
National Commission for Women committee

తూళ్లూరు: ఏపి రాజధాని అమరావతిని కాపాడుకోవడం కోసం జరుగుతున్న ఉద్యమం క్రమంగా హింసాత్మక రూపు దాల్చుతోంది. ఉద్యమకారులపై పోలీసులు విరుచుకుపడుతున్న సంఘటనలు ఎక్కువయ్యాయి. తుళ్లూరులో మహిళలపై జరిగిన పోలీసు దాడి తీవ్ర విమర్శలపాలైంది. ఈ నేపథ్యంలో
తూళ్లూరు గ్రామ మహిళలపై పోలీసు చర్య పట్ల సుమోటోగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ ఏపీకి కదిలివచ్చింది. తుళ్లూరులో అసలేం జరిగిందన్న అంశం నిగ్గుతేల్చేందుకు మహిళా కమిషన్ నిజ నిర్ధారణ కమిటీ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో తుళ్లూరు వచ్చిన కమిటీ సభ్యులు ప్రవీణ్ సింగ్, కాంచన కట్టర్ తదితరులు తొలుత మహిళలపై దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆపై తూళ్లూరు చేరుకుని డీఎస్పీతోనూ, తహసీల్దార్ తోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా తూళ్లూరు మహిళలు కమిషన్ సభ్యులతో మాట్లాడుతూ తమపై పోలీసులు ఏ విధంగా దాడి చేసిందీ వివరించారు. కొందరు వీడియో సాక్ష్యాలను కూడా కమిషన్ ముందుంచారు. కాగా ఈ పర్యటనలో జాతీయ మహిళా కమిషన్ సభ్యుల వెంట టిడిపి ఎంపి గల్లా జయదేవ్ కూడా ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/