తుగ్లక్‌ పాలనలో ప్రజలకు ఎన్ని కష్టాలో!

nara lokesh
nara lokesh

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిపై టిడిపి నేత నారా లోకేష్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 9 నెలల తుగ్లక్‌ పాలనలో ప్రజలకు ఎన్ని కష్టాలో! మండిపడ్డారు. వైఎస్సార్‌సిపి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వలన రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని దుయ్యబట్టారు. ఇబ్బందుల ఊబిలో కూరుకుపోతున్న ప్రజలకు అండగా టిడిపి పార్టీ ఫిబ్రవరి 19 నుండి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ఈ ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/