ప్రతి మహిళ దిశ యాప్‌ను ఉపయోగించుకోవాలి

తల్లి గర్భంలో ఎంత రక్షణ ఉంటుందో.. అలాంటి రక్షణ ఏపీలో ఉంది

ap home minister mekathoti sucharitha
ap home minister mekathoti sucharitha

గుంటూరు: ప్రతి మహిళ దిశ యాప్‌ను ఉపయోగించుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత కోరారు. ఆదివారం ఆమె నరసరావుపేటలో దిశ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ..తల్లి గర్భంలో ఎంత రక్షణ ఉంటుందో..అలాంటి రక్షణ ఆంధ్రప్రదేశ్‌లో ఉందని హోంమంత్రి అన్నారు. తెలంగాణలో జరిగిన దిశ ఘటన దేశంలో సంచలనం కలిగించిందని..ఇలాంటి సంఘటనలు ఏపీలో జరగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిశ చట్టాన్ని ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మహిళల కోసం ప్రత్యేకంగా దిశ ఎస్‌ ఓ ఎస్‌ యాప్‌ను కూడా రూపొందించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ దిశ యాప్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులే ఇప్పుడు కూడా కొనసాగుతున్నారని..కానీ రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు పోలీస్‌ శాఖపై నిందలు వేస్తున్నారని హోంమంత్రి విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/