ఆ కాయితాలు భద్రంగా దాచుకో!

ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలోనే బయటపడుతుంది

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టిడిపి కార్యాదర్శి వారి కుటుంబ ఆస్తులను మీడియా వేదికగా ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. చంద్రబాబు నాయుడు తన ఆస్థి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటించారు. ఆయన కుమారుడు అయిన నారా లోకేష్‌ ఎమో ఆస్తుల వివరాలంటూ, ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ముకొడతాడని విమర్శించారు. ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలో బయట పడుతుంది. అప్పటి దాకా ప్రకటించిన ఆస్థి తాలుకా కాయితాలు భద్రంగా దాచుకో లోకేష్‌ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/